
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), బ్లాక్రాక్ జాయింట్ వెంచర్ కంపెనీ జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా సర్వీస్లు అందించేందుకు సెబీ, బీఎస్ఈ నుంచి అనుమతులు పొందింది. మ్యూచువల్ ఫండ్ బిజినెస్కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా పనిచేసేందుకు జియో బ్లాక్రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి కిందటి 27న అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. తాజా లైసెన్స్తో, జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఆన్లైన్లో సర్వీస్లను అందించడంపై దృష్టి పెడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ మార్క్ పిల్గ్రెమ్ను మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది.