
న్యూఢిల్లీ: వైఫై సేవల కోసం 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్లో స్పెక్ట్రమ్ ఉపయోగించడానికి ఆమోదం కోరుతూ రిలయన్స్ జియో టెలికాం విభాగం టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ ను (టీఈసీ) సంప్రదించింది. జియో టెలికమ్యూనికేషన్స్ టీఈసీ టెక్నికల్విభాగాన్ని ఈ మేరకు అభ్యర్థించినట్టు తెలిసింది. ఈ విషయమై జియోకు పంపిన ఈ–మెయిల్కు ఎటువంటి స్పందనా రాలేదు.
రూల్స్ప్రకారం.. 5జీ కోసం కేటాయించిన స్పెక్ట్రమ్ను ఇతర టెక్నాలజీల కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. 2022లో నిర్వహించిన టెలికాం స్పెక్ట్రం వేలంలో మొత్తం రూ.1.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి.