26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌‌‌‌ కోరిన జియో

26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌‌‌‌ కోరిన జియో

న్యూఢిల్లీ: వైఫై సేవల కోసం 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌‌‌‌లో స్పెక్ట్రమ్‌‌‌‌ ఉపయోగించడానికి ఆమోదం కోరుతూ రిలయన్స్ జియో టెలికాం విభాగం  టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ ను (టీఈసీ) సంప్రదించింది. జియో టెలికమ్యూనికేషన్స్ టీఈసీ టెక్నికల్​విభాగాన్ని ఈ మేరకు అభ్యర్థించినట్టు తెలిసింది. ఈ విషయమై జియోకు పంపిన ఈ–మెయిల్‌‌‌‌కు ఎటువంటి స్పందనా రాలేదు.

రూల్స్​ప్రకారం.. 5జీ కోసం కేటాయించిన స్పెక్ట్రమ్‌‌‌‌ను ఇతర టెక్నాలజీల కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటే ముందస్తు అనుమతి తప్పనిసరి.  2022లో నిర్వహించిన టెలికాం స్పెక్ట్రం వేలంలో మొత్తం రూ.1.5 లక్షల కోట్ల విలువైన  బిడ్లు వచ్చాయి.