కమల్నాథ్ కు కాంగ్రెస్ బిగ్ షాక్.. పీసీసీ చీఫ్ నుంచి తొలిగింపు

కమల్నాథ్ కు కాంగ్రెస్ బిగ్ షాక్..  పీసీసీ చీఫ్ నుంచి తొలిగింపు

మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. పీసీసీ చీఫ్ గా ఆయన్ను తప్పి్ంచింది.  కమల్నాథ్ స్థానంలో OBC నాయకుడు జితు పట్వారీని నియమించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ప్రకటించారు.  ఇటీవల జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటిమికి బాధ్యత వహిస్తూ కమల్నాథ్ రాజీనామా చేస్తాడని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.  

ఈ క్రమంలో అధిష్టానమే ఆయన్ను తప్పించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో జితు పట్వారీ ఓటమిపాలయ్యాడు.  సావు అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసిన ఆయన  35 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.    మధ్యప్రదేశ్‌లో OBCలు  50% కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు కాగా 230 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ కేవలం 66 సీట్లు మాత్రమే సాధించగలిగింది.  బీజేపీ 163 స్థానాలను గెలుచుకుంది.