కూకట్పల్లి, వెలుగు: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో శుక్రవారం జేఎన్టీయూ, సర్వేజన ఫౌండేషన్ మధ్య ఎంవోయూ కుదిరింది. జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ డాక్టర్ టి.కిషన్కుమార్రెడ్డి, సర్వేజన ఫౌండేషన్ ప్రతినిథి, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ బి.జనార్ధన్రెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించటానికి అవగాహన కల్పించడమే ఎంవోయూ ఉద్దేశ్యమన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వరరావు, అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ వి.కామాక్షిప్రసాద్, సర్వేజన ఫౌండేషన్ సీఈవో ప్రవీణ్కుమార్ పాల్లొన్నారు.
