నిరుద్యోగులూ.. జాగ్రత్త...గాంధీలో ఉద్యోగాల పేరిట కేటుగాళ్ల వల

నిరుద్యోగులూ.. జాగ్రత్త...గాంధీలో ఉద్యోగాల పేరిట కేటుగాళ్ల వల
  •     భారీ జీతం, సౌకర్యాలంటూ దగా

పద్మారావునగర్, వెలుగు: నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరలేపారు. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ దవాఖానలో మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్రూట్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. వార్డ్​బాయ్, స్వీపర్, సెక్యూరిటీ గార్డు వంటి పోస్టులకు రాతపరీక్ష లేకుండానే డైరెక్ట్ రిక్రూట్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామని, నెలకు రూ. 31,500 నుంచి రూ. 46 వేల వరకు జీతం ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఈ తప్పుడు ప్రకటనల్లో ‘గాంధీ హస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్’ పేరుతో నకిలీ స్టాంపులను కూడా వాడుతుండటంతో నిరుద్యోగులు సులభంగా నమ్మి మోసపోతున్నారు.

పర్మినెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగం, పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ ఉంటాయని పేర్కొంటూ ఆన్​లైన్ లింకుల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరికొన్ని చోట్ల స్పీచ్ థెరపీ, మార్చురీ అటెండర్ వంటి 39 పోస్టులు ఉన్నాయని, అప్లికేషన్ ఫీజు కింద రూ. 300 చెల్లించాలని కోరుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఈ ప్రకటనల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, డీఎంఈ కార్యాలయం కోఠి తెలంగాణ అని రెండు రాష్ట్రాల పేర్లను కలిపి వాడుతుండటం గమనార్హం.

సైబర్​ క్రైమ్​కు ఫిర్యాదు చేశాం: సూపరింటెండెంట్

ఈ వ్యవహారంపై గాంధీ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్ వాణి స్పందిస్తూ.. ప్రస్తుతం హాస్పిటల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ లేదా అవుట్​సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన ఎలాంటి నియామకాలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. సోమవారం కొంతమంది నిరుద్యోగులు హాస్పిటల్​కు వచ్చి ఆరా తీయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు క్లిప్పింగ్​లను నమ్మవద్దని, ఈ నకిలీ ప్రకటనలపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండి మోసగాళ్ల బారిన పడవద్దని కోరారు.