అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్ రాజధాని వార్సాలో ఈనెల 25న పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో సమావేశం అవుతారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చిస్తారు.అమెరికాకు మద్దతు ఇస్తోన్న యూరోపియన్ యూనియన్, మిత్రదేశాలతో కలిసి తాము అనుసరించాల్సిన వ్యూహాల గురించి మాట్లాడతారు. పోలాండ్ పర్యటన ముగించుకున్న తర్వాత బైడెన్ బెల్జియం బయల్దేరి వెళ్తారు. బ్రస్సెల్స్ లో నిర్వహించబోయే నాటో,జీ-7,యూరోపియన్ యూనియన్ కు చెందిన మిత్రదేశాలతో సమావేశమవుతారు.బైడెన్ యాత్ర ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా.. పుతిన్ కు వ్యతిరేకంగా సాగనుంది. రష్యాను ఒంటరి చేసేందుకు ప్రపంచాన్ని సమీకరించడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు బైడెన్.
మరిన్ని వార్తల కోసం
ఉక్రెయిన్తో వార్ లో రష్యాకు ఎదురుదెబ్బలు
ఇది టెర్రరిజమే.. యుద్ధ నేరంగానే చూస్తం