ఈనెల 25న పోలాండ్ లో బైడెన్ పర్యటన 

ఈనెల 25న పోలాండ్ లో బైడెన్ పర్యటన 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్‌ రాజధాని వార్సాలో ఈనెల 25న పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో సమావేశం అవుతారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చిస్తారు.అమెరికాకు మద్దతు ఇస్తోన్న యూరోపియన్ యూనియన్‌, మిత్రదేశాలతో కలిసి తాము అనుసరించాల్సిన వ్యూహాల గురించి మాట్లాడతారు. పోలాండ్ పర్యటన ముగించుకున్న తర్వాత బైడెన్ బెల్జియం బయల్దేరి వెళ్తారు. బ్రస్సెల్స్ లో నిర్వహించబోయే నాటో,జీ-7,యూరోపియన్ యూనియన్ కు చెందిన మిత్రదేశాలతో సమావేశమవుతారు.బైడెన్ యాత్ర ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా.. పుతిన్ కు వ్యతిరేకంగా సాగనుంది. రష్యాను ఒంటరి చేసేందుకు ప్రపంచాన్ని సమీకరించడంపైనే  ప్రధానంగా దృష్టి సారించారు బైడెన్. 

మరిన్ని వార్తల కోసం

ఉక్రెయిన్​తో వార్ లో రష్యాకు ఎదురుదెబ్బలు

ఇది టెర్రరిజమే.. యుద్ధ నేరంగానే చూస్తం