అసంతృప్తి వాదులకు కేటీఆర్ బుజ్జగింపులు

అసంతృప్తి వాదులకు కేటీఆర్ బుజ్జగింపులు
  •     జాన్సన్ నాయక్ కోసం పని చేయాలంటూ సూచన

ఖానాపూర్, వెలుగు : బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో మంత్రి కేటీఆర్ సంప్రదింపులు జరుపుతూ వారిని బుజ్జగిస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కేటీఆర్ ఫ్రెండ్ భూక్య జాన్సన్ నాయక్ కు టికెట్ ను ఖరారు చేసిన  విషయం తెలిసిందే. అయితే ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎంపీ సంతోష్ కుమార్ అనుచరుడైన పూర్ణ చందర్ నాయక్ తో కేటీఆర్

గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో చర్చలు జరిపారు. జాన్సన్ నాయక్ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేస్తే భవిష్యత్తులో ప్రాధాన్యత కల్పిస్తానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. సుముఖత వ్యక్తం చేసిన నేతలు అభ్యర్థి గెలుపు కోసం తామంతా సమిష్టిగా పనిచేస్తామని వెల్లడించారు.