
పెద్దపల్లి/కరీంనగర్ సిటీ, వెలుగు: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం చేపట్టిన ధర్నాకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు లీడర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎంపీ వంశీకృష్ణ అనుచరులు బాలసాని సతీశ్, అల్లం సతీశ్, దీపక్, శ్రీనివాస్, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ పాల్గొన్నారు.