అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: ఈ రోజు ఉదయం అసెంబ్లీకి వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల మొదటి రోజు సభకు అడ్డు తగులుతున్నారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు. తమ సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కేసు విచారించిన హైకోర్టు.. ఎమ్మెల్యేలను సస్పండ్ చేసిన తీరు సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కోర్టు నోటీసులు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అసెంబ్లీ కార్యదర్శికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలను మంగళవారం స్పీకర్ వద్దకు తీసుకెళ్లాలని ఆయన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన కాపీలతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. కొద్దీ సేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవనున్నారు. కాగా ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

మరిన్ని వార్తల కోసం...

ఇయ్యాల బహుజనుల హీరో కాన్షీరాం జయంతి

‘ద కాశ్మీర్​ ఫైల్స్’కు పన్ను మినహాయింపు