జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్ దే సీటు అంటున్న ఎగ్జిట్ పోల్స్.. ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్ దే సీటు అంటున్న ఎగ్జిట్ పోల్స్.. ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి..?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముగిసింది. 2025 నవంబర్ 11 వ  తేదీ సాయంత్రం వరకు 48.42 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్ సర్వేల ఆధారంగా తెలుస్తోంది. వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

చాణక్య స్ట్రాటజీస్:

చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. 
బీఆర్ఎస్ కు 41 శాతం ఓట్లు పడ్డాయని పేర్కొంది.

స్మార్ట్ పోల్:

కాంగ్రెస్ అభ్యర్థికి 48 శాతం ఓట్లు పడగా.. బీఆర్ఎస్ కు 41 శాతం ప్రజలు ఓటేశారని స్మార్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. 

నాగన్న సర్వే:

కాంగ్రెస్ పార్టీకి 47 శాతం ఓట్లు పడినట్లు ఈ సర్వే అంచనా వేసింది. అదేవిధంగా  బీఆర్ఎస్ కు 41 శాతం ఓటింగ్ నమోదైనట్లు అంచనా వేసింది. 

హెచ్ఎంఆర్:

ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 48.31 శాతం ఓట్లు పడినట్లు అంచనా వేసింది. 
బీఆర్ఎస్ అభ్యర్థికి 43.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. 

V6 ఎక్స్క్లూజివ్ సర్వే:

ఇక V6 వెలుగు ఎక్స్ క్లూజివ్ సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్స్ లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థికి 50 నుంచి 55 శాతం, బీఆర్ఎస్ అభ్యర్థికి 40 నుంచి 45 శాతం, బీజేపీ అభ్యర్థికి 07 నుంచి 08 శాతం ఓట్లు పడ్డాయని వీ6 ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. పక్కాగా శాంపిల్స్ సేకరించి వీ6-వెలుగు సర్వే చేసింది. జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

జూబ్లీహిల్స్‌లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల13 వందల 65 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్తిగా లంక దీపక్ రెడ్డి బరిలో దిగారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది. 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా 2025 నవంబర్ 11న ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం మందగొడిగా మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పెరిగింది. ఆ తర్వాత ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యా్హ్నం 3 గంటలకు 40.2 శాతం ఉన్న పోలింగ్.. సాయంత్రానికి 47.16 శాతానికి చేరుకుంది.