జూబ్లీహిల్స్ బైపోల్ : ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్
జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా అన్ని చోట్ల ఓటింగ్ కొనసాగుతోంది. రాజకీయ ,సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్బలగాలను మోహరించగా.. 1,761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు.
