లంచం కేసులో పరారీలో ఉన్న జూబ్లీహీల్స్ సీఐ బలవంతయ్య ఏసీబీ అధికారులకు లొంగిపోయాడు. గురువారం రూ.50 వేలు, మందు బాటిళ్లు లంచం తీసుకుంటుండగా జూబ్లీహీల్స్ ఎస్సై సుధీర్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. అయితే సీఐ బలవంతయ్య ఆదేశాల మేరకే తాను డబ్బు తీసుకున్నానని ఎస్సై చెప్పాడు. ఎస్సై, సీఐ మధ్య జరిగిన మాటల కాల్ రికార్డ్స్ ఆధారంగా అధికారులు కేసు నమోదు చేశారు. నిన్నటి నుంచి పరారీ లో ఉన్న బలవంతయ్య కోసం ఏసీబీ అధికారులు గాలించారు. ఇప్పటికే బలవంతయ్యని సీపీ అంజన్ కుమార్ సస్పెండ్ చేశారు.