పద్మారావునగర్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. ఔట్ పేషెంట్ల(ఓపీ) సేవలు, ఎలక్టివ్సర్జరీలు, వార్డు డ్యూటీలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు గాంధీ జూనియర్ డాక్టర్ల యూనిట్ ప్రెసిడెంట్ ఎం వంశీకృష్ణ తెలిపారు.
ఎమర్జెన్సీ, ఐసీయూలో డ్యూటీలు కొనసాగుతాయన్నారు. రెగ్యులర్గా తమకు స్టైఫండ్ ఇవ్వాలని, ఏపీ మెడికల్ స్టూడెంట్స్కు ఇస్తున్న15 శాతం రిజర్వేషన్లను తొలగించాలని, అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులతో కూడిన హాస్టళ్లను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను తొలగించి, కొత్త భవనాలను నిర్మించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చేవరకు తమ సమ్మె కొనసాగుతుందన్నారు.