ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణేం విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ దూరం

ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణేం విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ దూరం

దివంగత ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం రూ.100 స్మారక నాణేంను ఇవాళ(ఆగస్టు 28) విడుదల చేయనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతల మీదుగా ఈ నాణెం విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా పాలోననున్నారు. 

అంతేకాదు ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, పలు పార్టీల ప్రముఖులతో దాదాపు 200 మందికి ఆహ్వానాలు వెళ్లాయి. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావట్లేదని తెలుస్తోంది.

కారణం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటమే. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో జరుగుతోంది. ఈ కారణంగానే  జూనియర్ ఎన్టీఆర్ ఈ  కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తుంది. గతంలో హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా హాజరు కాలేదు జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు వచ్చాయి.

ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం చర్చనియ్యాంశంగా మారింది.