ప్రజాభేరిని సక్సెస్​ చేద్దాం: జూపల్లి కృష్ణారావు

ప్రజాభేరిని సక్సెస్​ చేద్దాం: జూపల్లి కృష్ణారావు

నాగర్​ కర్నూల్, వెలుగు: ఈ నెల 30న కొల్లాపూర్​లో జరిగే పాలమూరు ప్రజాభేరి సభను సక్సెస్​ చేసేందుకు ప్రతీ కార్యకర్త కదిలి రావాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. బుధవారం కొల్లాపూర్​లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య కార్యకర్తలతో  సన్నాహక సమావేశం నిర్వహించారు.  టీపీసీసీ కార్యదర్శి రంగినేని అభిలాష్​​రావు, డీసీసీ​అధ్యక్షుడు డా. వంశీకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు.

 ప్రియాంకగాంధీ పాల్గొనే ఈ సభకు 3 లక్షల మందిని సమీకరిద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్​కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఫాంహౌజ్​ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించేలా పోరాడుదామన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా పాలమూరు ప్రజాభేరి సక్సెస్​ చేస్తామన్నారు. ప్రజాభేరి సభ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి, కాంగ్రెస్ విజయానికి నాంది కావాలని డీసీసీ అధ్య క్షుడు డా.వంశీకృష్ణ అన్నారు.