జవాన్ మూవీ ట్రైలర్‌ చూసా.. గూస్బంప్స్ : బాక్సాఫీస్ క్రిటిక్

జవాన్ మూవీ ట్రైలర్‌ చూసా.. గూస్బంప్స్ :  బాక్సాఫీస్ క్రిటిక్

క్రేజీ డైరెక్టర్ అట్లీ(Atlee)..బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)  నుంచి రాబోతున్న మూవీ జవాన్. రీసెంట్ గా ‘జవాన్’(Jawan) ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’(జూ లై 12న) సినిమా థియేటర్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

తాజాగా బాక్సాఫీస్ క్రిటిక్ హార్మీందర్ సింగ్ ట్వీట్ చేస్తూ "ఇప్పుడే లండన్‌లో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ ట్రైలర్‌ని చూసాను. ప్యూర్ గూస్‌బంప్స్, మాసియెస్ట్ ట్రైలర్. అట్లీ 2 నిమిషాల 15 సెకన్లలో కింగ్ ఖాన్ షారూఖ్ సత్తా చూపించాడు. ఈ మూవీ విడుదలయ్యాక ఇండియా బాక్సాఫీస్ రీకార్డ్స్ అన్నిటిని అధిగమిస్తుందని వెల్లడించాడు". దీంతో పాటుగా ఈ మూవీకు 4.75/5 రేటింగ్ కుడా తన ఖాతాలో తెలిపారు. 

జవాన్ ట్రైలర్ రిలీజ్ కాకముందే థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తం దక్కించున్న ఈ మూవీ ముందు ముందు ఇంకెన్నీ రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.
 
షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార నటిస్తుంది. ఈ మూవీ లో విజయ్ సేతుపతి(Vijay Sethupathi)  విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, రిధి డోగ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ గా  ‘జవాన్’ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న విడుదల కానుంది. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో అడియన్స్ ముందుకు రానుంది.