ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే కార్మికులకు బల్దియా జీతాలా?

ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే కార్మికులకు బల్దియా జీతాలా?
  •     కాంగ్రెస్​ నాయకులు జువ్వాడి 

మెట్ పల్లి, వెలుగు : కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడి.. తన తోటలో, ఇంట్లో పని చేస్తున్న కార్మికులకు బల్దియా నుంచి జీతాలు ఇప్పించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్​ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. పదేళ్లుగా బల్దియా నుంచి చెల్లించిన జీతాలను వెంటనే రికవరీ చేయాలని డిమాండ్​ చేశారు.

మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తన తోటలు, ఫామ్ హౌజ్, ఇంట్లో పని చేస్తున్న 10 మంది కార్మికులకు కోరుట్ల, మెట్ పల్లి బల్దియాల నుంచి జీతాలు ఇప్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్​ అధ్యక్షులు లింగం, కొంతం రాజు, మైపాల్ రెడ్డి, జెట్టి లక్ష్మణ్, ఎల్లా నరేశ్​పాల్గొన్నారు.