GV Prakash: తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా.. విడాకుల ట్రోల్స్పై జీవీ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్

GV Prakash: తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా.. విడాకుల ట్రోల్స్పై జీవీ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) తన భార్య సైంధవి(Saindhavi) నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్నీ ఇద్దరు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దాంతో వీరి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. దాదాపు 13 ఏళ్లపాటు ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట విడిపోవడం ఏంటా? అని అవాక్కయ్యారు. అయితే.. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించారు. 

అయితే.. ఈ విషయంపై నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. అవి జీవీ ప్రకాష్ వరకు చేరడంతో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ ట్రోలింగ్స్ పై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.. జరిగిన విషయంపై సరైన అవగాహన లేకుండా ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయం గురించి ప్రజలు చర్చించుకోవడం బాధగా ఉంది. సెలబ్రిటీల పేరుతో వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేయడం కరక్ట్ కాదు. అవి ఇద్దరి జీవితాలపై ప్రభావం చూపుతాయని గుర్తించని తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా?

మా విడాకులకు గల కారణాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయడం జరిగింది. అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. అసలు ఎం జరిగిందని తెలియకుండా మీరు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నా. దయచేసి అందరి భావోద్వేగాలను గౌరవించండి. ఈ విషయంలో మాకు సపోర్ట్ గా నిలిచినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ” అని రాసుకొచ్చాడు జీవీ ప్రకాష్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.