
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీపై తరచూ విమర్శలు చేస్తున్న ఆ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్పై అదే పార్టీకి చెందిన సీనియర్ నేత కె.మురళీధరన్ మండిపడ్డారు. థరూర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండటం శశిథరూర్కు కష్టంగా ఉంటే, ఆయన తనకు నచ్చిన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవచ్చని సూచించారు.
ప్రస్తుతం ఆయన పార్లమెంటరీ బాధ్యతలతో పాటు పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్గా డ్యుయల్ రోల్ పోషిస్తున్నారని చెప్పారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకుంటే ఆయనకే మంచిదని పేర్కొన్నారు.