
- ఉత్తరాఖండ్ సైనిక కుటుంబంలో విషాదం
డెహ్రాడూన్: రెండు నెలల వ్యవధిలోనే అన్నదమ్ములు వీర మరణం పొందడంతో ఆర్మీ కుటుంబంలో విషాదం అలుముకుంది. దేశ సేవలో ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉత్తరాఖండ్ జిల్లాలోని థాటీదాగర్ గ్రామానికి చెందిన బల్వత్ సింగ్ నేగి కొడుకు ప్రణయ్ నేగి (33), తమ్ముడి కొడుకు ఆదర్శ్ నేగి(27) ఇద్దరూ సైన్యంలో చేరారు.
మేజర్ ప్రణయ్ నేగి లేహ్ లో సరిహద్దు రక్షణ విధుల్లో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న మేజర్ ప్రణయ్ నేగి అమరుడయ్యారు. దీంతో బల్వంత్ సింగ్ నేగి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ బాధ నుంచి ఇంకా తేరుకోకుండానే తాజాగా కథువా జిల్లాలో జరిగిన టెర్రర్ అటాక్ లో బల్వంత్ నేగి తమ్ముడి కొడుకు ఆదర్శ్ నేగి కూడా అమరుడయ్యాడు.