Kajal Agarwal : తిరుమల శ్రీవారి సేవలో కాజల్

Kajal Agarwal : తిరుమల శ్రీవారి సేవలో కాజల్

సీని నటి కాజల్ అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కొడుకుతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం  రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కొడుకు పుట్టాక కాజల్ తిరుమలకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2020లో వ్యాపారవేత్త  గౌతమ్ కిచ్లూని కాజల్ పెళ్లాడింది. వీరికి 2022లో కొడుకు పుట్టాడు. ప్రస్తుతం కాజల్ శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వస్తోన్న ఇండియన్ 2 మూవీలో నటిస్తోంది.