కాకా, పీవీ రావు చిరస్మరణీయులు.. చివరిశ్వాశ వరకు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు..

కాకా, పీవీ రావు చిరస్మరణీయులు.. చివరిశ్వాశ  వరకు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు..
  • మాల మహానాడు  జాతీయ అధ్యక్షులు చెన్నయ్య

మెహిదీపట్నం, వెలుగు: పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి చివరి శ్వాస వరకు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి (కాకా), పీవీ రావు పనిచేశారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య కొనియాడారు. సోమవారం ఏసీ గార్డ్స్​లో జరిగిన కాకా 11వ వర్ధంతి, పీవీ రావు 20వ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. వారి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.