
- ఇప్పటి వరకు 114 మంది విచారణ
- విచారణ ఎదుర్కొన్న ఇంజినీర్లు , నిర్మాణ సంస్థల సీఈవోలు, ఇతరులు
- ఇటీవలే మాజీ మంత్రులు ఈటల, హరీశ్ ను ప్రశ్నించిన కమిషన్
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ సుదీర్ఘ విచారణలో ఇప్పటి వరకు 114 మందిని ప్రశ్నించింది. ఇవాళ 115వ వ్యక్తిగా కేసీఆర్ ను విచారణకు పిలిచింది. ఈ నెల 6న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నించింది. ఆయన సమిష్టి నిర్ణయం మేరకే మేడిగడ్డ లొకేషన్ మార్చామని చెప్పారు. కేబినెట్ అప్రూవల్ మేరకే నిర్ణయాలు జరిగాయని కమిషన్ కు వెల్లడించారు.
ALSO READ | కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు..కేసీఆర్ సమాధానాలు
ఆ తర్వాత హాజరైన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు టెక్నికల్ అంశాలన్నీ ఇంజినీర్లే చూసుకున్నారని, తమకు సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చారు. కేసీఆర్ అనారోగ్యం బారిన పడిన నేపథ్యంలో ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఇన్ కెమెరా విచారణ జరుపుతోంది.
గతంలో కాళేశ్వరం కమిషన్ అందరినీ ఓపెన్ కోర్టులోనే విచారించింది. దీంతో ఇవాళ్టి విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది.