
- కేసీఆర్, ఈటల, హరీశ్ స్టేట్మెంట్ల ఆధారంగా అడిగిన కమిషన్
- వివరాలను పంపాలని సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్: కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను కేబినెట్ లో చర్చించే తీసుకున్నట్టు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కమిషన్ కు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అప్పటి కేబినెట్ తీర్మానాల కాపీలను అందజేయాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పంపింది. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ అడిగిన వివరాలన్నీ పంపాలంటూ అధికారులను ఆదేశించారు.