‘కాళేశ్వరం’పై గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలపై దృష్టి..స్టడీ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్

‘కాళేశ్వరం’పై గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలపై దృష్టి..స్టడీ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్
  • హైదరాబాద్​ చేరుకున్న జస్టిస్​ ఘోష్​

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై గత బీఆర్ఎస్  ప్రభుత్వం కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలపై కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ దృష్టి సారించింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని షిఫ్ట్​ చేయడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ల మార్పు, కాంట్రాక్ట్​ల అప్పగింత వంటి వాటిపై గత బీఆర్ఎస్​ సర్కారు కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలను కమిషన్  పరిశీలించనుంది. ఇటీవల ఓపెన్​ కోర్టులో భాగంగా ప్రాజెక్టుపై కేబినెట్  ఆమోదంతోనే ముందుకు వెళ్లామని కేసీఆర్, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ కమిషన్​కు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్​ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కమిషన్​ ఆదేశించింది. 

 గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫైళ్లను గత నెల 30 నాటికి కమిషన్​కు ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు ఆ ఫైళ్లను కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ స్టడీ చేయనున్నట్లు తెలిసింది. ఆ ఫైళ్లను అధ్యయనం చేసేందుకు ఆదివారం ఆయన హైదరాబాద్​ చేరుకున్నారు. ఫైళ్లలోని అంశాలు, కేసీఆర్, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ వెల్లడించిన అంశాల ఆధారంగా రిపోర్టును తయారు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే  అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్టును కమిషన్​ సిద్ధం చేసింది. ప్రజాప్రతినిధులనూ విచారించిన నేపథ్యంలో వారి స్టేట్​మెంట్ల కూడా రిపోర్టులో చేర్చాల్సి ఉంది.