కాళేశ్వరం ఓఫెయిల్ ప్రాజెక్ట్​ : కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

కాళేశ్వరం ఓఫెయిల్ ప్రాజెక్ట్​ : కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి:  యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు.  ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా వెంకటస్వామికి పెద్దపల్లితో 70 ఏండ్ల అనుబంధం ఉంద న్నారు. తొలదశ ఉద్యమంలో కాకాది కీలకపాత్ర ఉందన్నారు.  పెన్షన్​ స్కీం, రేషన్​ సిస్టంను కాకానే అమలు  చేశారన్నారు. పేదలకు గుడిసెలు, ఇండ్ల స్థలాలు ఇప్పించారన్నారు. ప్రజల డబ్బును కేసీఆర్​, కేటీఆర్​ దోచుకున్నారని ఆరోపించారు.  

బీఆర్​ఎస్​ పాలనలో నిరుద్యోగం పెరిగిందన్నారు. రాష్ట్రంలో నీళ్లు లేవని, నిరుద్యోగులకు కొలువులు ఇవ్వలేదన్నారు. పేదలు, కార్మికుల కోసం పనిచేస్తానన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన పేరుతో హామీలను నెరవేరుస్తున్నామన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు తిన్నారని మండిపడ్డారు.  కాళేశ్వరం ఫెయిల్​ ప్రాజెక్ట్​ అని విమర్శించారు. ప్రజల కోసమే కాంగ్రెస్​ ఉందన్నారు. తనను ఎంపీ గెలిపిస్తే చిన్న కొడుకులాగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.  రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. పత్తిపాక రిజర్వాయర్​ కోసం పోరాడుతానని ఆయన ప్రకటించారు.