కాళేశ్వరం ముంపు రైతులకు పరిహారం చెల్లించాలి

కాళేశ్వరం ముంపు రైతులకు పరిహారం చెల్లించాలి

ప్రాణహిత వరదతో మునిగిన భూములు కాళేశ్వరం ముంపు భూములుగా గుర్తించి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేలా డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి…కమీషన్ల కక్కుర్తితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని మండిపడ్డారు. వరదతో తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలన్నారు వివేక్.