Kalki 2898AD: ప్రజల మనస్సుల్లో భైరవ నిలిచిపోతాడు.. కల్కి నిర్మాత కామెంట్స్ వైరల్

Kalki 2898AD: ప్రజల మనస్సుల్లో భైరవ నిలిచిపోతాడు.. కల్కి నిర్మాత కామెంట్స్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). క్రియేటీవ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు లో ఇండియన్ సినీ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్(Amitab Bachchan), కమల్ హాసన్(Kamal Haasan) కీ రోల్స్ లో కనిపిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పాడుకొనే(Deepika Padukone), దిశా పాఠాని(Disha pataani) హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా కల్కి చిత్ర నిర్మాత స్వప్న దత్ హీరో ప్రభాస్ గురించి, ఆయన పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఆమె సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమెకు కల్కి సినిమా గురించి ప్రశ్న ఎదురయింది. దానికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ చేస్తున్న భైరవ పాత్ర ప్రేక్షకుల మదిలో చాలా ఏళ్లపాటు గుర్తుండిపోతుంది.. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ పాత్ర గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక కల్కి 2898 ఏడీ కథ విషయానికి వస్తే.. ఈ కథ మహాభారతం తో మొదలై భవిష్యత్తులో 2898 వరకు సాగుతుంది. ఈ మధ్య ఉన్న దాదాపు ఆరువేల సంవత్సరాల కాలంలో జరిగే కథనే కల్కి సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ఈ మధ్యే ప్రకటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఎలెక్షన్స్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.