హైదరాబాద్ సుచిత్రలో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌ షురూ

హైదరాబాద్ సుచిత్రలో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌ షురూ

హైదరాబాద్​, వెలుగు: కళ్యాణ్ జ్యువెలర్స్ హైదరాబాద్​ కొంపల్లి సమీపంలోని  సుచిత్ర సర్కిల్‌ వద్ద తమ సరికొత్త షోరూమ్‌ను ఆరంభించింది. బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున, నటి శ్రీలీల ఈ దీనిని ప్రారంభించారు.  కళ్యాణ్ జ్యువెలర్స్ వివిధ కలెక్షన్ల నగలు ఇక్కడ దొరుకుతాయి.  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, “కళ్యాణ్ జ్యువెలర్స్ తో నాకున్న దీర్ఘకాల అనుబంధం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. 

‘నమ్మకమే  జీవితం ’ అనే కంపెనీ సిద్దాంతం పట్ల వారి నిబద్ధత పరిశ్రమలో వారిని ప్రత్యేకంగా నిలబెట్టింది” అని అన్నారు.    ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కళ్యాణ్ జ్యువెలర్స్ ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు, అన్ని ఉత్పత్తుల మేకింగ్ చార్జీలపై  50 శాతం తగ్గింపు ఇస్తామని తెలిపింది.  ఆభరణాల కొనుగోలుదారులకు కళ్యాణ్ జ్యువెలర్స్ ఫోర్​-లెవల్ అష్యూరెన్స్ సర్టిఫికెట్‌ను కూడా ఇస్తామని సంస్థ తెలిపింది.