హైదరాబాద్, వెలుగు:భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ (కేఎస్ఎస్ఎల్)కు భారత రక్షణ శాఖ రూ. 250 కోట్ల విలువైన కాంట్రాక్టు ఇచ్చింది.
2026 నవంబర్ నాటికి అండర్ వాటర్ సిస్టమ్స్ను సరఫరా చేయాలి. కేఎస్ఎస్ఎల్ గత ఐదు సంవత్సరాలుగా మానవ రహిత సముద్ర వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో సామర్థ్యాలను పెంచుకుంది. భారత నౌకాదళంలో కేఎస్ఎస్ఎల్ సరఫరా చేసిన అన్మ్యాన్డ్మెరైన్ సిస్టమ్స్ సేవలు అందిస్తున్నాయి.
