పోలీసులు వేధిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కమల్

పోలీసులు వేధిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కమల్

పోలీసులు వేధిస్తున్నారంటూ ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. కమల్, శంకర్ కాంబోలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఇండియన్-2 సినిమా చెన్నై శివార్లలో షూటింగ్ జరుపుకుంటుండగా, సెట్స్ పై భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్ బాయ్ చనిపోయారు.

ప్రమాద ఘటనకు సంబంధించి నటుడు కమలహాసన్ కు CBCID పోలీసులు నోటీసులు జారీ చేసింది. దీనిపై కమల్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ వ్యవహారంలో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ కమల్ లేటెస్టుగా కోర్టును ఆశ్రయించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.