ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామని ప్రకటనలు చేస్తున్నాయి కేంద్రంలోని బీజీపీ..మరోవైపు తమిళనాడులో అన్నాడిఎంకె ప్రభుత్వాలు. దీనిపై తీవ్రంగా స్పందించారు నటుడు, రాజకీయనాయకుడు కమల్ హాసన్. ఇంకా అందుబాటులోని రాని వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇవ్వడం చెత్తగా ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల క్రమంలో అన్నాడీఎంకేతో… బీజేపీతో పొత్తు పెట్టుకున్న మరుసటి రోజు కమల్ విమర్శలు చేశారు. పేదల ఆకలితో ఆడుకోవడం అలవాటుగా మారిందని, వారి జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నిస్తే..మీ రాజకీయ జీవితాలను వారు నిర్ణయిస్తారని హెచ్చరించారు కమల్.
బీహార్ ఎన్నికల్లో భాగంగా రూపొందించిన బీజేపీ మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్లు అందిస్తామని ప్రకటించింది. అదేవిధంగా తమిళనాడులో రానున్న ఎన్నికల క్రమంలో సీఎం పళనిస్వామి కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామంటూ ప్రకటన చేశారు. వీటిపై విపక్షాల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.