
చెన్నై : విలక్షణ నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది ఎన్నికల కమిషన్ . పార్టీకి గుర్తు కేటాయించడంతో కమల్ ట్విట్టర్ లో ఈసీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి తగిన గుర్తే లభించిందని ట్విట్ చేశారు. తమిళనాడు, దేశ రాజకీయ చరిత్రలో మక్కల్ నీది మయ్యం టార్చ్ బేరర్ గా మారబోతోందంటూ ట్విట్ చేశారు. 2018 ఫిబ్రవరి 21న కమల్ హాసన్ పార్టీని స్థాపించారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతానని కమల్ ఇప్పటికే ప్రకటించారు. స్వచ్ఛమైన చేతులతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అవినీతి పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కలపమని స్పష్టంచేశారు. డీఎంకేతో తెగదెంపులు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
MNM thanks the Election commision for granting us the "Battery Torch" symbol for the forthcoming elections. So appropriate. @maiamofficial will endeavour to be the “Torch-Bearer” for a new era in TN and Indian politics.
— Kamal Haasan (@ikamalhaasan) March 10, 2019