
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం రూపొందించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు కీలక పాత్ర పోషించగా త్రిష, అభిరామి హీరోయిన్స్. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా పాన్ ఇండియా వైడ్గా ప్రమోషన్స్ చేస్తోంది టీమ్. రీసెంట్గా విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి నేను సెల్యూట్ చేస్తాను.
అలాగే నేను కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ చేశాను. అయినా అవన్నీ మర్చిపోయి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మంచి సినిమాలు చేయడం నా బాధ్యత. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి ఈ సినిమాతో వస్తున్నా. గొప్ప సినిమా చేశామని మేమంతా భావిస్తున్నాం’ అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ మర్చిపోలేనిది అని శింబు అన్నారు.
ఇంద్రాణిగా ఆడియెన్స్కు గుర్తుండిపోయే పాత్ర చేశానంది త్రిష. నటులు నాజర్, అభిరామితో పాటు తెలుగులో సినిమా రిలీజ్ చేస్తున్న సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.