కామారెడ్డి జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

కామారెడ్డి జిల్లా  పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

 కామారెడ్డి​, వెలుగు : రాష్ర్ట ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఉత్తమ సేవా, సేవా పతకాలకు కామారెడ్డి జిల్లా  పోలీసు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు.  వివిధ విభాగాల్లో  ఉత్తమ సేవలు అందించే వారికి ఈ పతకాలు ఇస్తారు.  రాష్ర్ట అవతరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రభుత్వం ఈ లిస్టు ప్రకటించింది.  జిల్లా నుంచి 17 మంది పతకాలు దక్కగా ఉత్తమసేవా పతకానికి 1,  సేవా పతకాలకు 16 మంది ఎంపికైనట్లు ఎస్పీ రాజేశ్​ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. 

ఉత్తమ సేవా పతకానికి కె. లింగయ్య (  ఏఆర్​ హెడ్ కానిస్టేబుల్),  సేవా పతకాలకు ఎన్​. శ్రీనివాస్ (  సీసీఎస్​ సీఐ),  ఆర్​. దత్తాద్రిగౌడ్​ ( ఎస్సై- భిక్కనూరు), ఎ.శ్రీనివాస్​ ( ఏఎస్సై- కామారెడ్డిటౌన్​), సుబ్రహ్మణ్యచారి ( ఏఎస్సై- దోమకొండ), ఎం.ప్రభాకర్​రెడ్డి( ఏఎస్సై-మాచారెడ్డి),  ఎస్​. సత్యానారాయణరెడ్డి ( ఏఆర్​ ఎస్సై), కె.శంకర్​ ( ఏఎస్సై- బిచ్​కుంద), ఎం.నారాయణ(  ఏఆర్​ హెడ్​కానిస్టేబుల్), పి.కృష్ణమూర్తి ( హెడ్​కానిస్టేబుల్ రామారెడ్డి), ఎస్​. రవికుమార్​ (హెడ్​కానిస్టేబుల్​-గాంధారి), టి.సత్యంగౌడ్​ ( ఏఆర్​ హెడ్​కానిస్టేబుల్​), టి.కిషన్​ ( హెడ్​కానిస్టేబుల్, సీసీఎస్​), టి.లక్ష్మణరావు ( హెడ్​కానిస్టేబుల్​-ఎన్​​ఐబీ), వి.శ్రీధర్ (ఏఆర్​ హెడ్​ కానిస్టేబుల్), ఎ.దేవేందర్ ( కానిస్టేబుల్- లింగంపేట), జి.రాజ్​కుమార్ ( మద్నూర్ కానిస్టేబుల్)లకు పతకాలు అందనున్నాయి. పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరుకు ఈ పతకాలు నిదర్శనమని, ఎస్పీ అభినందించారు.

37 మంది పోలీసులకు స్టేట్​ పతకాలు

నిజామాబాద్​, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవరణను పురస్కరించుకొని ఇందూర్​ జిల్లాకు చెందిన 37 మంది పోలీస్​లకు ఉత్తమ పతకాలను అందించనున్నట్లు సీపీ ఆఫీస్ అధికారులు తెలిపారు. పొల్లు రవీందర్​ సీసీఎస్​ ఇన్​స్పెక్టర్​కు మహోన్నత సేవ పతకం, పి.సాయన్న ఎస్​ఐ రుద్రూర్​కు ఉత్తమ సేవా పతకం ప్రకటించగా మిగితా 35 మందికి సేవా పతకాలను అనౌన్స్​ చేసింది. వీరిలో పలువురు ఎస్​ఐలు, హెడ్​కానిస్టేబుళ్లు, పీసీలు ఉన్నారు.