
కామారెడ్డి, వెలుగు : రాష్ర్ట ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఉత్తమ సేవా, సేవా పతకాలకు కామారెడ్డి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించే వారికి ఈ పతకాలు ఇస్తారు. రాష్ర్ట అవతరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రభుత్వం ఈ లిస్టు ప్రకటించింది. జిల్లా నుంచి 17 మంది పతకాలు దక్కగా ఉత్తమసేవా పతకానికి 1, సేవా పతకాలకు 16 మంది ఎంపికైనట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్తమ సేవా పతకానికి కె. లింగయ్య ( ఏఆర్ హెడ్ కానిస్టేబుల్), సేవా పతకాలకు ఎన్. శ్రీనివాస్ ( సీసీఎస్ సీఐ), ఆర్. దత్తాద్రిగౌడ్ ( ఎస్సై- భిక్కనూరు), ఎ.శ్రీనివాస్ ( ఏఎస్సై- కామారెడ్డిటౌన్), సుబ్రహ్మణ్యచారి ( ఏఎస్సై- దోమకొండ), ఎం.ప్రభాకర్రెడ్డి( ఏఎస్సై-మాచారెడ్డి), ఎస్. సత్యానారాయణరెడ్డి ( ఏఆర్ ఎస్సై), కె.శంకర్ ( ఏఎస్సై- బిచ్కుంద), ఎం.నారాయణ( ఏఆర్ హెడ్కానిస్టేబుల్), పి.కృష్ణమూర్తి ( హెడ్కానిస్టేబుల్ రామారెడ్డి), ఎస్. రవికుమార్ (హెడ్కానిస్టేబుల్-గాంధారి), టి.సత్యంగౌడ్ ( ఏఆర్ హెడ్కానిస్టేబుల్), టి.కిషన్ ( హెడ్కానిస్టేబుల్, సీసీఎస్), టి.లక్ష్మణరావు ( హెడ్కానిస్టేబుల్-ఎన్ఐబీ), వి.శ్రీధర్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్), ఎ.దేవేందర్ ( కానిస్టేబుల్- లింగంపేట), జి.రాజ్కుమార్ ( మద్నూర్ కానిస్టేబుల్)లకు పతకాలు అందనున్నాయి. పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరుకు ఈ పతకాలు నిదర్శనమని, ఎస్పీ అభినందించారు.
37 మంది పోలీసులకు స్టేట్ పతకాలు
నిజామాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవరణను పురస్కరించుకొని ఇందూర్ జిల్లాకు చెందిన 37 మంది పోలీస్లకు ఉత్తమ పతకాలను అందించనున్నట్లు సీపీ ఆఫీస్ అధికారులు తెలిపారు. పొల్లు రవీందర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్కు మహోన్నత సేవ పతకం, పి.సాయన్న ఎస్ఐ రుద్రూర్కు ఉత్తమ సేవా పతకం ప్రకటించగా మిగితా 35 మందికి సేవా పతకాలను అనౌన్స్ చేసింది. వీరిలో పలువురు ఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, పీసీలు ఉన్నారు.