
కామారెడ్డి టౌన్, వెలుగు : ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కామారెడ్డి ఏఎస్సీ చైతన్యరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలోని డబుల్ బెడ్ రూమ్స్ సముదాయంలో స్థానికులు ఏర్పాటు చేసుకున్న 30 సీసీ కెమెరాలను ఏఎస్పీ ప్రారంభించి మాట్లాడారు.
ప్రజలు రూ. 2 లక్షలు చందాలు వేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో టౌన్ సీసీ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై శ్రీరామ్, సిబ్బంది కమలాకర్రెడ్డి, విశ్వనాథ్, అజర్, సంపత్, నర్సారెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.