సీఎంను కలిసిన ఎమ్మెల్యే కాటిపల్లి

సీఎంను కలిసిన ఎమ్మెల్యే కాటిపల్లి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మెడికల్ కాలేజీకి అదనంగా భూకేటాయింపుతో పాటు అప్రోచ్​రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సోమవారం సీఎం రేవంత్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మెడికల్​  కాలేజీకి కేవలం 7 ఎకరాలు మాత్రమే కేటాయించారని, భవిష్యత్​లో కాలేజీ విస్తరణతో పాటు ఇతర అవసరాల దృష్ట్యా అదనంగా భూమి కేటాయించాలని కోరారు.  

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం నుంచి 26 ఎకరాల స్థలం కేటాయించాలని విన్నవించారు. మెయిన్​ రోడ్డు నుంచి డిగ్రీ కాలేజీ పక్క నుంచి మెడికల్ కాలేజీ వరకు 6‌‌‌‌‌‌‌‌ అడుగుల వెడల్పుతో అప్రోచ్​రోడ్డు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.