
కామారెడ్డి, వెలుగు : ‘భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలోని గజ్యానాయక్ తండా రైతు వేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. తొలి విడత సదస్సులు విజయవంతమయ్యాయని, రెండో విడత సదస్సులు ఈ నెల 20 వరకు జరుగుతాయన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి రశీదులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ వి. విక్టర్, ఆర్డీవో వీణ, తహసీల్ధార్ సరళ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లు నిర్మించుకునేలా ప్రొత్సహించాలి..
ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకునేలా ప్రొత్సహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేసి పత్రాలు అందించారు. హౌజింగ్ పీడీ జయపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఐ- పాస్ అప్లికేషన్లపై రివ్యూ..
టీజీ ఐ పాస్లో వచ్చిన అప్లికేషన్లపై కలెక్టర్ చర్చించారు. కలెక్టరేట్లో మంగళవారం డిస్ర్టిక్ ఇండస్ర్టియల్ ప్రమోషనల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఐ పాస్ కింద అప్లయ్ చేసుకున్న 5 అప్లికేషన్లకు పెట్టుబడి రాయితీ రూ. 17. 58 లక్షలు మంజూరు చేయటానికి కమిటీ ఆమోదించింది. జిల్లా ఇండస్ర్టియల్ జనరల్ మేనేజర్ వి.లాల్, అధికారులు పాల్గొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవ పోస్లర్లు రిలీజ్..
ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పోస్లర్లను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రిలీజ్ చేశారు. ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతం చెద్దాం’ అనే థీమ్తో ప్రజలు ప్లాస్టిక్ వాడటాన్ని తగ్గించాలన్నారు. పర్యావరణ ఇంజినీర్ లక్ష్మణ్ప్రసాద్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా బక్రీద్ నిర్వహించుకోవాలి..
కామారెడ్డిటౌన్, వెలుగు : ఈ నెల7న బక్రీద్ ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులు, మత పెద్దలతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, ఆర్డీవో వీణ, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.