భూభారతితో భూ సమస్యలు పరిష్కారం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

భూభారతితో భూ సమస్యలు పరిష్కారం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు : ‘భూభారతి’తో  భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలోని గజ్యానాయక్​ తండా రైతు వేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ మాట్లాడారు.  తొలి విడత సదస్సులు  విజయవంతమయ్యాయని, రెండో విడత సదస్సులు ఈ నెల 20 వరకు జరుగుతాయన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి రశీదులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ వి. విక్టర్​, ఆర్డీవో వీణ, తహసీల్ధార్​ సరళ అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

ఇండ్లు నిర్మించుకునేలా ప్రొత్సహించాలి..

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకునేలా ప్రొత్సహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేసి పత్రాలు అందించారు. హౌజింగ్​ పీడీ జయపాల్​రెడ్డి పాల్గొన్నారు.

ఐ- పాస్​ అప్లికేషన్లపై రివ్యూ.. 

టీజీ ఐ పాస్​లో వచ్చిన అప్లికేషన్లపై కలెక్టర్ చర్చించారు.  కలెక్టరేట్​లో మంగళవారం డిస్ర్టిక్​ ఇండస్ర్టియల్ ప్రమోషనల్ కమిటీ మీటింగ్ జరిగింది.  ఐ పాస్​ కింద అప్లయ్​ చేసుకున్న 5 అప్లికేషన్లకు పెట్టుబడి రాయితీ  రూ. 17. 58 లక్షలు మంజూరు చేయటానికి కమిటీ ఆమోదించింది. జిల్లా ఇండస్ర్టియల్ జనరల్ మేనేజర్​ వి.లాల్, అధికారులు పాల్గొన్నారు. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవ పోస్లర్లు రిలీజ్..​ 

ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా  మంగళవారం  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో  పోస్లర్లను కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ రిలీజ్​ చేశారు.  ‘ప్లాస్టిక్​ కాలుష్యాన్ని  ప్రపంచ వ్యాప్తంగా అంతం చెద్దాం’ అనే థీమ్​తో  ప్రజలు ప్లాస్టిక్​ వాడటాన్ని తగ్గించాలన్నారు.  పర్యావరణ ఇంజినీర్ లక్ష్మణ్​ప్రసాద్,  జిల్లా రవాణా అధికారి  శ్రీనివాస్​రెడ్డి,  జిల్లా గ్రౌండ్ వాటర్​ అధికారి సతీష్​ యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.   

 ప్రశాంతంగా బక్రీద్ నిర్వహించుకోవాలి.. 

కామారెడ్డిటౌన్​, వెలుగు : ఈ నెల7న  బక్రీద్ ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో ఆయా శాఖల అధికారులు, మత పెద్దలతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు.  గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్​పోస్టులు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎస్పీ రాజేశ్​చంద్ర మాట్లాడుతూ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్​ వి.విక్టర్​, ఆర్డీవో వీణ, ఏఎస్పీ చైతన్యరెడ్డి,   ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.