ఎన్నికల ఫిర్యాదుల కోసం కంట్రోల్​ రూం ఏర్పాటు : జితేశ్​వి పాటిల్

ఎన్నికల ఫిర్యాదుల కోసం కంట్రోల్​ రూం ఏర్పాటు   : జితేశ్​వి  పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలను  ప్రశాంతంగా నిర్వహించేందుకు  ప్రతి  ఒక్కరూ  సహకరించాలని కామారెడ్డి కలెక్టర్​ జితేశ్​వి  పాటిల్​ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో  నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల  స్వీకరణకు 10 రోజుల ముందు వరకు కూడా  ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చన్నారు.  

ఫైనల్​ ఓటరు లిస్టులో ఏవరికైనా ఓటు లేకపోతే  బూత్​ లెవెల్​ఎలక్టోరల్​ ఏజెంట్,​ రిటర్నింగ్​ ఆఫీసర్​ దృష్టికి తీసుకురావాలని సూచించారు.  ఫిర్యాదుల కోసం కలెక్టరేట్ లో  కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  అనంతరం  ఈవీఎం గోడౌన్​ను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​ తదితరులు పాల్గొన్నారు.