కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద చేపడుతున్న ఎకో టూరిజం పనులు స్పీడప్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం పనులను పరిశీలించారు. డీలక్స్ కాటేజీలు, సూట్కాటేజీలు, స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్పనులను వానాకాలానికి ముందే కంప్లీట్ చేయాలన్నారు. అంతకు ముందు జుక్కల్ మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ను తనిఖీ చేశారు.
విద్యార్థులలతో కలిసి భోజనం చేశారు. మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే ఆంశాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, హౌజింగ్ పీడీ విజయపాల్రెడ్డి, డీపీవో మురళీ ఉన్నారు.ఎస్సెస్సీ ఎగ్జామ్ సెంటర్ కు ఫోన్లు తీసుకు రావద్దని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఎగ్జామినేషన్ చీఫ్సూపరింటెండెంట్లు, అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. డీఈవో రాజు పాల్గొన్నారు.
