
- డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్
కామారెడ్డి, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం పాల్వంచ మండలం భవానిపేటను ఆయన విజిట్ చేశారు. భవానిపేట పరిధిలో ఇటీవల 8 మందికి డెంగ్యూ నిర్ధారణ అయ్యింది.
పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. ఇక్కడ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ క్యాంపు నిర్వహిస్తోంది. జ్వరాలతో ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు. టెస్టు కోసం శాంపిల్స్ సేకరించారు. ఇంటింటా తిరుగుతూ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలు క్లీన్గా ఉంచుకోవాలని డీఎంహెచ్వో సూచించారు. మాచారెడ్డి పీహెచ్సీ డాక్టర్ ఆదర్శ్ తదితరులు ఉన్నారు.