
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ( అటానమస్) లో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి డిగ్రీలో మరో కొత్త కోర్సు ప్రవేశ పెట్టినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.విజయ్కుమార్ తెలిపారు. బీఎస్సీ ( హెల్త్ కేర్ మెనేజ్మెంట్) ప్రవేశపెడుతున్నామన్నారు.
ఈ కోర్సులో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు దోస్త్ రెండో విడతలో రిజిస్ర్టేషన్ చేసుకొని కోర్సును సెలక్ట్ చేసుకొవచ్చన్నారు. రెండో విడత దోస్త్లో రిజిస్ర్టేషన్కు ఈనెల 8 వరకు అవకాశం ఉందన్నారు.