కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మరో కొత్త కోర్సు

కామారెడ్డి  ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మరో కొత్త కోర్సు

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ( అటానమస్​) లో ఈ అకాడమిక్ ఇయర్​ నుంచి డిగ్రీలో మరో కొత్త కోర్సు ప్రవేశ పెట్టినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్​ కె.విజయ్​కుమార్​ తెలిపారు.  బీఎస్సీ ( హెల్త్ కేర్​ మెనేజ్​మెంట్) ప్రవేశపెడుతున్నామన్నారు. 

ఈ కోర్సులో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.    ఆసక్తి ఉన్న విద్యార్థులు దోస్త్ రెండో విడతలో రిజిస్ర్టేషన్​ చేసుకొని కోర్సును సెలక్ట్​ చేసుకొవచ్చన్నారు.  రెండో విడత దోస్త్​లో రిజిస్ర్టేషన్​కు ఈనెల 8 వరకు అవకాశం ఉందన్నారు.