
కామారెడ్డి, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 60వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా జడ్జి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ బుధవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాల ప్రకారం.. లింగంపేట మండలం గాంధీనగర్కు చెందిన అక్కరేని శ్రీకాంత్ ముస్తాపూర్లో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసేవాడు. అక్కడ ఓ 14 ఏండ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి బైక్పై మేడ్చల్ జిల్లా డబిల్పూర్ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకపోవటంతో కుటుంబీకులు 7 జూలై 2022న లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ బాలికను 6 జూలై 2022న లింగంపేట పోలీస్ స్టేషన్ వద్ద వదిలి పారిపోగా, పోలీసులు దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు. సరైన ఆధారాలతో బుధవారం కోర్టులో హాజరు పరిచారు. సాక్ష్యాలను పరిశీలించి శ్రీకాంత్కు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 60వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. పోలీసుల తరఫున పీపీ శేషు వాధించారు. ఎంక్వైరీ చేసి సాక్ష్యాలను కోర్టులో సమర్పించిన అప్పటి ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్రెడ్డి, ప్రస్తుత డీఎస్పీ శ్రీనివాస్రావు, ఎస్సై, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.