
షాద్ నగర్: షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మదనం గ్రామంలో బుధవారం రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్య కలకలం రేపింది. ప్రముఖ రియల్టర్ కమ్మరి కృష్ణ అలియాస్ కేకే తన సొంత ఫామ్ హౌస్ లో బాబా అనే వ్యక్తి దారణంగా హత్య చేశాడు. కేకే భార్య ముందే ఆయనపై కత్తులతో దాడి చేశారు దుండగులు. తీవ్రంగా గాయపడిన కేకేను శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెందాడు. భూ లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ హాస్పిటల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. షాద్నగర్ హత్య కేసు నిందితుడు బాబాను శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు. అనంతరం నిందితుడిని షాద్నగర్ పోలీసులకు అప్పగించారు.