చాయ్ ​చేస్తూ.. మెషీన్​ కుడుతూ..

చాయ్ ​చేస్తూ.. మెషీన్​ కుడుతూ..

ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలంటూ ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని 44, 45 వార్డుల్లో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి వినూత్నంగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా చాయ్ చేస్తూ.. మెషీన్​ కుడుతూ ప్రచారం చేపట్టారు. మావల గ్రామంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఇటింటికీ తిరుగుతూ ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మావల మండల అధ్యక్షుడు ధర్మపురి చంద్రశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.