హోరాహోరీగా తొలి టెస్టు విలియమ్సన్ సెంచరీ

హోరాహోరీగా తొలి టెస్టు విలియమ్సన్ సెంచరీ

సిల్హెట్ :  బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 310 వద్దే బంగ్లా ఆలౌటవగా రెండో రోజు, బుధవారం ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌‌లో 266/8 స్కోరుతో నిలిచింది.

  సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (104) కెరీర్‌‌‌‌లో 29వ సెంచరీతో సత్తా చాటాడు. డారిల్ మిచెల్ (41), గ్లెన్ ఫిలిప్స్‌‌ (42) కూడా రాణించారు. ప్రస్తుతం కైల్ జెమీసన్ (7 బ్యాటింగ్), కెప్టెన్ టిమ్ సౌథీ (1 బ్యాటింగ్) క్రీజులో  ఉన్నారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం నాలుగు వికెట్లు పడగొట్టాడు. బంగ్లా స్కోరుకు కివీస్ ఇంకా 44 రన్స్ దూరంలో ఉంది.