సినిమాలా.. రాజకీయాలా..?

సినిమాలా.. రాజకీయాలా..?

హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని మండి నుంచి లోక్ సభ ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్.. ఓ వైపు హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా,  మరోవైపు పొలిటీషియన్‌‌‌‌‌‌‌‌గా బిజీ అయ్యారు.  ఈ నేపథ్యంలో సినిమా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆమె ఫుల్‌‌‌‌‌‌‌‌ స్టాప్‌‌‌‌‌‌‌‌ పెట్టబోతోందనే ప్రచారం జరుగుతోంది.  ఈ ప్రచారంపై స్పందించిన కంగన.. అది ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదని,  కానీ జనం తనను పార్లమెంట్‌‌‌‌‌‌‌‌కు పంపారని ఆమె అన్నారు. 

తను లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటిస్తూ, దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘ఎమర్జెన్సీ’ చిత్రం విజయాన్ని సాధిస్తే.. సినిమాల్లో కొనసాగుతానని కంగన వెల్లడించారు.  ఒకవేళ రాజకీయాల్లో తన అవసరం ఎక్కువ అనిపిస్తే పొలిటీషియన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతానని,  తన  అవసరం ఎక్కువ ఎక్కడ ఉంటుందో, ఎక్కువ గౌరవం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటానని ఆమె అన్నారు. సినిమాలా, రాజకీయాలా అనే విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కంగన క్లారిటీ ఇచ్చారు.  ఇక ఇటీవల విడుదలైన ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ వస్తోంది. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కంగన ఇందిరాగాంధీ  పాత్రను పోషించింది.  సెప్టెంబర్ 6న సినిమా విడుదల కానుంది.