అమ్మగా కంగనా రనౌత్

అమ్మగా కంగనా రనౌత్

తమిళనాడు ప్రజల పాలిట అమ్మగా మారిన దివంగత సీఎం జయలలిత బయోపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ‘తలైవి’ అనే పేరుతో రాబోతున్న ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించబోతున్నారు.  ‘మణికర్ణిక’ చిత్రంతో ఇటు నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు అటు దర్శకురాలిగా మారారు కంగనా. ఎఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

బాహుబలి, మణికర్ణిక సినిమాలకు కథ అందించిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ‘తలైవి’ మూవీ స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందించనున్నారు. విజయేంద్రప్రసాద్ స్రిప్ట్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని హంగులు, ట్విస్ట్‌లు ఈ కథలో ఉంటాయంటున్నారు.

ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీలో రూపుదిద్దుకోబోతోంది. కంగనాతో ఈ పాత్ర చేయించడం ద్వారా కేవలం సౌత్ ప్రేక్షకులకే కాదు బాలీవుడ్లో కూడా ఎక్కువ మందికి దగ్గర కావచ్చని నిర్మాత, దర్వకులు భావిస్తున్నారు. ఇవాళ (మార్చి- 23)న కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ‘తలైవి’ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న జీవి ప్రకాష్ ట్విట్టర్ ద్వారా కంగనా రనౌత్ తలైవిగా నటించబోతున్న విషయాన్ని బ్రేక్ చేశారు.

ఇదిలా ఉంటే ‘తలైవి’ సినిమా తీస్తున్న సందర్భంగా దర్శక నిర్మాతలు జయలలిత కుటుంబం నుంచి నో అబ్జెక్షన్ లెటర్ కూడా తీసుకున్నారు. గత 9 నెలలుగా ఆమె జీవితంలో జరిగిన సంఘటనలపై పరిశోధన చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.