శ్రీకృష్ణుడి జన్మస్థలంపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీకృష్ణుడి జన్మస్థలంపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్.  ఉత్తర ప్రదేశ్ లోని మధురలో శ్రీ కృష్ణుడి జన్మ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా   యూపీలో వచ్చే సంవత్సరంలో జరిగే ఎన్నికలకు బీజేపీ తరపున ప్రచారా చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో జాతీయ వాదుల తరపున ప్రచారం చేస్తానన్నారు. అలాగే శ్రీ కృష్ణ జన్మస్థలంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కంగనా. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఈద్గా ఉందని..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసలైన పుణ్యస్థలాన్ని ప్రజలకు చూపిస్తారని అన్నారు. తాను చెప్పేది నిజమో కాదో.. నిజాయితీపరులు, జాతీయవాదులు, దేశం గురించి మాట్లాడే వారికి తెలుసన్నారు.