కంగనాకు వెల్‌‌కమ్ చెప్పిన ‘కూ’ యాప్

కంగనాకు వెల్‌‌కమ్ చెప్పిన ‘కూ’ యాప్

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అకౌంట్‌ను ట్విట్టర్ శాశ్వతంగా నిలిపివేసింది. రూల్స్ ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్ తెలిపింది. వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే కంగనాను ట్విట్టర్ ఇదివరకే హెచ్చరించింది. ఈ క్రమంలో ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన దేశీ యాప్ ‘కూ’.. కంగనాను తమ యాప్‌లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. కంగన తన అభిప్రాయాలను సగర్వంగా ‘కూ’లో పంచుకోవచ్చునని ఆ యాప్‌ కో-ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణన్ ఓ ప్రకటనలో అన్నారు. ‘కంగనా జీ, ఇది మీ ఇల్లు. మీ అభిప్రాయాలను అందరికీ సగర్వంగా తెలియజేయండి’ అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.